Total Pageviews

the LIFE is lesson

Experience is the best teacher. Generally you will get a lot of experiences in the LIFE so the life is the best teacher. Necessity is mother of invention we have a lot of essentials to live health and wealthy. So life is a great research.

Wednesday, January 27, 2010

part -9 conclusion of father

దురద్రుష్టి లేకుండా అప్పడికి అప్పుడు ఏర్పడే పనులు చేసుకుంటూ వెళ్ళడం  వాళ్ళ భూములను కోల్పోయి పిల్లలను అనాధలను చేసుకోవలసి వచ్చింది. అందుకే ప్రతి దానిని దురద్రుష్టితో ఆలోచించాలి ,అంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళ భవిష్యత్తు ఏమిటి అనేది పూర్తి స్థాయిలో ఆలోచించి పనులు చేయాలి.అలా పనులు చేసే క్రమంలో భూముల గురుంచి పట్టించుకొనే వాడు, అవి అలా భూముల విషయంలో గొడవలు వచ్చేవి కావు, ఆ విధంగా చంపబడి, ఆ పరిస్థితులు వచేవి కావు.

అతి చొరవ.
"అన్యధా శరణం నాస్తి" నాకు ఎక్కడ శరణం లేదు అన్నపుడు తప్ప ,వాళ్ళ సమస్య ఏమిటో వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళ కోసం మనం పాటు పాడడం,వల్ల మనమే విమర్శించ బడతాము.అందుకొరకు ఎవరైనా వరంతవారే వారి సమస్యను చెప్పి సహాయం కోరక ముందు,తనంత తానుగా చొరవ తీసుకోవడం తప్పిదం అని తెలియచేసింది .దానికి ఉదహరనే వాళ్ల తమ్ముడు బిడ్డలకు పెళ్ళిళ్ళు చేయడం ,తన బంధువులు ,చుట్టాలకు పెళ్లిలు చేయడం తర్వాత వాళ్ళతో నిందలు  పడడం జరిగింది. అందుకే ఇలాంటి విషయాలలో ఆచితూచి అడుగు వేయాలి.
చిన్న చిన్న బలహీనతలు.
చిన్న చిన్న బలహీనతలు కూడా ఒకోసారి నష్టం జరుగుతుంది.
    ఏదైనా మూక్యంగా ఒక మంచి పని చేయాలి అనుకున్నపుడు, అది వ్యవసతిక్రుత మార్గం ద్వారానే చేయాలి,ఒక వ్యక్తిక దానికి సహకరించడం ,నాయకత్వం వహించండం చేయాలి  తప్ప కేవలం ఏక వ్యక్తిగా చేస్తే అది అనుకున్న లక్ష్యం పూర్తిగా నెరవేరదు, సరికదా! విల్లా వ్యక్తిగత జీవితం కూడా కోల్పోవలసి వస్తుంది.ఉదాహరణకి వైద్య సంస్థ అనేది ఒక ధర్మ సంస్థగా ఏర్పడి ,గుడిలకు మాన్యాలు ఉన్నట్టు దీనికి ఉండాలి కాని అలాంటి భూములు లేకపోవడం వల్ల ,ఉచితంగా వైద్యం చేసే సంస్థలు ,వ్యవస్థ లేకపోవడం వల్ల .
తనోక్కేడే   అలాంటి పనులు చేయడం వల్ల వ్యక్తిగతంగా నష్టపోయాడు.అలా వ్యక్తిగతంగా కాకుండా వ్యవస్తిక్రుతంగా  చేయడం వల్ల అది లక్ష్యాని చేరుకుంటుంది, మరియు వ్యక్తుల యొక్క వ్యక్తిగత సమస్యలని భంగాపరచకుండా ఉంటుంది.కనుక ప్రతి ఒక్కరు ఏదైనా పని చేయాలి అనుకున్నపుడు విడివిడిగా చేసే బదులుగ ఐక్యతగా, వ్యవసతిక్రుత  &  ఐ క్యవిధనంలో చేయడం మంచిది .
దాని కొరకు వ్యవస్థను ఏర్పాటు చేయడం , పాటు పాడడం ముక్యవసరం.
     అంతే కాని ఇలా ఎకవక్తిగా పనిచేస్తే  జీవితాలే దుర్భారపాలు అవుతాయి. దానికి ఉదాహరనే అతని పిల్లలు చెట్టుకొకరు పుట్టకొకరు విడిపోయి, దుర్భర దారిధ్యాన్ని అనుభవించడమే సాక్ష్యం. దాని వల్ల కూడా తమ సంతానంలో మేధావులు ,పైకి రావలిసిన వారు కూడా తిండి లేక ,సరిగా బడికి వెళ్ళలేని పరిస్థితి వల్ల కూడా . ఒక మేధావిని సమాజానికి దూరం చేసినట్టు అవుతుంది. అతని మేధస్సు వల్ల అందవలసిన సేవలు సమాజానికి అందకుండా పోతుంది, దీని కారణంగా అతను సమాజానికి దూరంగా ఉంటుంది.
   కొన్ని కొన్ని సందర్బలో   అనాధగా పెరిగిన పిల్లలు అరాచక శక్తులుగా, రౌడీలుగా మారుతారు. కాని ఇక్కడ అద్రుష్టవశాత్తు అలా జరగలేదు. అయితే ఈ విధంగా బిడ్డలా భవిష్యత్తు పట్టించుకోకుండా ,దురద్రుష్టి లేకుండా చేసే పనుల వల్ల కూడా చాలా నష్టాలూ వస్తాయి.
 కథానాయకుడి మాటలలో :
    నాన్న చేసిన తప్పు ఎంటటే , మా పెద్ధన్నకు పెళ్లి చేసేటప్పుడు ,అతనికి తెలియకుండానే, అసలు ఇరువురికి పెళ్లి పై అవగాహనా లేకుండానే పెళ్లి చేసారు.దాని ఫలితంగా వారిద్దరు సక్రమంగా కలిసి ఉండలేక పోయారు  ............ of course పిల్లలని అయితే కన్నారు ,కాని వాళ్ళు  జీవితకాలం కలిసుండ లేకపోయారు. మేచుర్యుటి రాని వయస్సులో పెళ్లి చేయడం ఒక తప్పు, ఇంకోటి సంపాదన లేకుండానే చేయడం రెండో తప్పు.
దానికి కారణం గారాబంగా పెంచి ,  సంపాదన, ఆస్తులు ఉన్నాయి  కాదా అని ఉద్యోగానికి సరిగా వెళ్లకున్న కూడా ఏమి అనలేదు ,దాని కారణంగా అతని ఉద్యోగం పోయింది.

పెద్దక్క చిన్నపుడు ఓ సారి బడిలో రోజంతా గదిలో ఉంచారట ,అ విషయం అమ్మకు చెపితే బడి మానిపించింది. విద్య విధానం సరిగా లేకపోవడం వల్ల ,మా అమ్మ గారాబం వల్ల ఆమెకి చదువు రాకుండా పోయింది. ప్రక్క ఊరు అయిన చితుకూరులోని RMP Doctor కి ఇచ్చి పెళ్లి చేసాడు.కాని అతనికి చదువు రాని పిల్లని  పెళ్లి చేసుకున్నానని భావనాతో సరిగా చూసుకోలేదు.

సమీక్షా  : 
1. ఒక నిర్దిష్టమైన వైద్యవిధానం లేకపోవడం వల్ల ,ఒక  అద్భుతమైన  వైద్యుడు, తన వైద్యాని  పూర్తి స్థాయిలో వినియోగించలేక, వినియోగించిన  భంగపాటు చెందాడు.
2. కౌలుకి  ఇచ్చినదుకు కృతజ్ఞత భావం ఉండవలసింది పోయి  , హత్యా చేయడం అనేది చాలా దారుణమైన పని  . హు.... పాముకు పాలు పోసి పెంచినట్టయింది .
 అయిన వాళ్ళు చేసిన పాపం ఊరికే పోలేదు   చక్రపాణికి నరుప్పలు వచ్చి జీవితాంతం పోలేదు, ఒకడికి పిచ్చి పటింది, ఇంకొకడు చనిపోయాడు .దేవుడు వాళ్ళకి తగిన శాస్తి చేసాడు.
అయిన ఇంత వరకు ఎవరు చంపారనేది  ... కోర్టు లో నిజ నిర్ధారణ జరగలేదు.

Thursday, January 7, 2010

part -7 his father murder mystery

కౌలుదార్లపై కోర్టులో కేసు వేస్తే , న్యాయదేవత గుడ్డిది కాదు అని నిరూపిస్తూ పొలం నాన్నకే వచేలా తీర్పు రేపు వస్తుంది అనగా .
 అంతకుముందు రోజు.
రేపు భీష్మ ఏకాదశి ఇంట్లో ఏమీలేవు ,పిల్లలకి ఏమైనా కొనాలి అని ,డబ్బు కోసం కౌలుదారులు ఉన్న ఊరికి పొద్దు పొద్దున్నే  వెళ్ళాడు నాన్న.

11 గంటల ప్రాంతంలో నేను ఇంటి ముందు ఆడుకుంటుంటే ఎవరో ఒకతను పరిగెత్తుకుంటూ  వచ్చి ....
అమ్మతో " అమ్మ! అమ్మ.. అయ్యగారిని మీ కౌలుదార్లు చంపరమ్మ " అన్నాడు.
అమ్మ వెంటనే చనిపోయిన స్థలానికి వెళ్ళింది. ఆ రాత్రి అందరు వెళ్ళిపోయినా తర్వాత కూడా అమ్మ ఒక్కతే అలాగే  నాన్న నిర్జీవ శరీరం ప్రక్కన  తెల్లారి పోలిస్ లు వచ్చి నాన్నని తీసుకువెళ్ళేదాక ఉంది.

నాన్న ని చంపినా దృశ్యాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు, ధైర్యం చేసి న్యాయదేవత ముందు నిజం చెప్పలేక. బాధతో  అమ్మకి  జరిగిన విషయం అంత  చెప్పారు అమ్మకి చెబుతుంటే  విన్నాను.
నాన్న తిరిగి మా ఊరికి వస్తుంటే , మా స్థలంలోనే ఉన్న గుట్ట ప్రాతం దగ్గర దొంగచాటుగా నాన్నని చంపడానికి కౌలుదారులైన కొండయ్య,బక్కాయ,చక్రపాణి కాపుకాసి ఎదురుచూస్తున్నారు. నాన్న వచ్చేది గమనిచిన వాళ్ళు ముందుగా   బక్కయ్య & చక్రపాణి  వచ్చి అయ్యగారు దండం అన్నారు ,ఏదో మాట్లాడడానికి వచ్చరనుకొని నిలబడితే ,వెంటనే   వెనుక నుంచి కొండయ్య గొడ్డలితో మెడ మీద నరికాడు .గాయంతో ఊర్లోకి  పరిగెడుతుంటే దోతి అడ్డు వచ్చి పడిపోయాడు, అదేఅదునుగా ముగ్గురు కొట్టి చంపారు.
"అమ్మ మేము నిస్సహాయులమమ్మ ,ఏమి చేయలేకపోయం. అయ్యగారు
చనిపోతు " రామ రామ " అంటుంటే   మా హృదయం ధ్రవించివేసింది ." అని రోదించారు.

   కథానాయకుడి  మాటలలో  :
     అ ఒక్క రోజు తపిస్తే పొలం ఇక కోర్టు కేస్ తీర్మానం అయిపోతుండె , తర్వాత వాళ్ళు డబ్బుల మీద డబ్బులు కురుపించి ( లంచాలు ) ఎస్. ఐ., లయర్లకి కొన్నుకున్నారు. ఇంతవరకు ( 1968 -till today ) ఎవరు చంపారు అనేది తెలియకుండా చేసారు.
   అప్పుడు మా పెద్దన్న  18 years  ఉండే .మా అమ్మ గర్వం ,మరియు జల్సా గ పెరిగి, లగ్జేరిగా ఆలోచించి దాని గురుంచి ఏమి చాయ లేక పోయాడు ,కాని చేశాను అని చెప్తాడు అది సబబు అనిపించలేదు.
     పాలోల్లు అందరికి పగ ఉండేది,ఎందుకంటే వీడు ఒక్కడు బాగా అభివృధి చెందుతున్నాడు, అందరిలో పేరు వస్తుంది అని ఈర్ష్య కొద్ది ఎవరు మా గురుంచి ,ఆ కేస్ గురుంచి పట్టించుకోలేదు. అందుకే నాకు బంధువుల మీద మంచి అభిప్రాయం లేదు. మంచిగా ఉన్నన్ని నాళ్ళు  ఇంటి చుట్టూ తిరిగి, కష్టాలలో ఉన్నప్పుడు కనీస ఆదరణ, ఆప్యాయత  కూడా  పంచలేదు.

Introduction

The life is a lesson ........it's a true story.
కథని
కథానాయకుడు చెపుతున్నట్టుగా చాల వరకు, కొన్నిసార్లు రచయితి చెపుతున్నట్టుగా  వ్రాయబడింది.


 రచయిత  :
ఆరు . సుచరిత




Note /గమనిక :
typing mistakes ఉంటాయి, వాటిని పరిగణనలోనికి తీసుకోకండి త్వరలో సరిదిద్దుదాము.

Wednesday, January 6, 2010

part -8 roaming with mam

కథానాయకుడి మాటలలో

మా  నాన్న  చనిపోయిన  తర్వాత నేను & అమ్మ కలిసి  తాటిపాముల కొత్తపల్లి  &  తిరుమలగిరి  ఊరికి  వెళ్ళితే, అక్కడ నాన్న ద్వారా  ఆరోగ్యాన్ని పొందిన దొరలు మర్యాదలు చేసి , సంభావన ఇచ్చి పంపేవారు. వైష్ణవా సంప్రదాయం ప్రకారం పూజ చేసి దేవుడికి అరగింపుగా వారే స్వయంగా వండి ,దానినే తినే సంప్రదాయం ఉన్న కారణంగా, ఎక్కడికి వెళ్ళిన అమ్మే వంట చేసేది. అదే మేము తినే వారము. తిరుగు ప్రయాణం  అయ్యేటప్పుడు ఎంతోకొంత దక్షిణ సమర్పించుకునే వారు.
నాన్న చనిపోయిన కూడా  వెళ్లిన ప్రతిసారి వారు ఎంతో అభిమానించే వారు .

part -6 chinnanati sambaralu

చిన్ననాటి సంబరాలు , కథానాయకుడి మాటలలో.

మా ఇంటినుంచి ఆ ఊరికి వెళ్ళే స్థలమంతా మాదే మధ్యలో గుట్ట కూడా ఉంటుంది. ఆ ప్రక్కన ఓ ఊరి కూడా పుట్టింది , మా స్థలంలోనే . చెరువు కింద పొలం వచ్చింది, బుడుగు బావి ఉండేది చాల fresh చేపలు దొరికేవి, చింత చెట్టుకి బోలెడు చింతకాయలు కాసేవి మేము వాటిని తెంపుకొని తినేవాళ్ళం .

part -2 thatha.

జగ్గయకి  5 గురు కొడుకులు , ఇద్దరు  బిడ్డలు పుట్టారు .
అతని పెద్ద కొడుకే కథానాయకుడి తండ్రి  " రంగనాథ స్వామి " .
అందరికి భూమి పంచగ రంగనాథస్వామి కి 80  ఎకరాలు వచ్చింది .


మన కథ నాయకుడు బహుశ అప్పుడు  ౩ ఏళ్ళ వయ్యసు ఉంది .
జగ్గయ్య చనిపోయే దశలో, మంచం మీద పడుకొని ఉన్న ,అతనికి నోట్లో పాలు పోయడం కళ్ళారా చూసాడు. అంతేకాదు మొట్టమొదటి సారిగా & ఇప్పటి వరకు చివరిసారిగా చుసిన దహనా సంస్కారాలను కూడా అతని తాతాదే. 

part -1 muthatha

రామంజయ్య  వైద్యం చేసుకుంట్టు రాజాపురం కి వచ్చాడు.


వట్టి  చేతులతో వచ్చిన వ్యక్తి అక్కడి దొరలకు,జమిన్ధరులకు ,సంస్థానదిషులు వైద్యచికిత్స చేస్తూ  అనతికాలంలోనే కేవలం వైద్యం ద్వారానే  500  వందల ఎకారాలు సంపాదించాడు.
అంతే కాదు ఊర్లో మంచి  పేరుప్రక్యతలు సంపాదించాడు.



అతని ఏకైక సంతానం  " జగ్గయ్య ".

Tuesday, January 5, 2010

part -3 about his father

చుట్టుప్రక్కల ఊర్లో వాళ్ళందరికి  అయ్యగారి మంచితనం గురించి తెలుసు.
జనాలతో మమేకమై :
అంటరానితనం  ప్రబలంగా ఉన్న ఆ రోజులలో  దానిని ఖాతరు చేయక హరిజనులతో కలసి అనేక సంస్కృత కార్యక్రామాలు నిర్వహించాడు.
వైద్యంలో నిమగ్నమై :
ఓ సారి ఉస్మానియా ఆసుపత్రి వాళ్ళు ఇక బ్రతకడం కష్టం అని చెప్పి ఇంటికి పంపిస్తే , ఆ దొరకి (జీడికంటి రాంరెడ్డి, తాటిపాముల గ్రామనివాసి ) వైద్యం చేసి బ్రతికించాడు.
దొరలకే కాదు పేదవారికి సైతం ఉచితంగా వైద్యం అందించే వారు అనడానికి ఓ మచ్చుతునక ............ రఘునాథపల్లి నుంచి ఓ బీద మహిళా (అనాసుయా) రోగంతో వేగలేక చివరిదశలో , చూపించుకోవడానికి వస్తే,  మందులకు కూడా డబ్బు లేని ఆమెకి  ఉచితంగా మందులు ఇచ్చి ,భోజనం పెట్టి ఆమె  రోగం తగ్గిన తర్వాతా కొంత డబ్బు ఇచి పంపారు.
ఎవరొచ్చినా ముందు వారికి వైద్యం అందించడం మొట్టమొదటి కర్తవ్యం, చేసిన తర్వాత వారేమైనా ఇస్తే తిసుకోనేది లేకపోతే లేదు.
పైగా వాళ్ళకి ఏమి లేకపోతే ఎదురుపెట్టేవారు.అది తిండైనా,మందులైన ఇతరత్రా ఖర్చులన్నీ భరించి వాళ్ళని బాగుచేసి  పంపేవారు.
మనుషులని గుడ్డిగా నమ్మి :
ఇలా ఇందులోనే నిమగ్నమై వ్యవసాయం గురుంచి పట్టించుకోకుండా ఉండడం వాళ్ళ , కౌలికి తీసుకున్న వాళ్ళు దుర్మగ్నమైన ఆలోచన చేసి అప్పుడిచం,ఇప్పుడిచం అని దొంగ లెక్కలు చుప్పెట్టి భూములు మావే అని తిరగబడ్డారు.

Part -4 situations (hero's birth)

వ్యాస్ పుట్టే వరకు ఉన్న పరిస్థితులు :
 కుటుంబ పరిస్థితులు:

  1. 80 ఎకరాలున్న , ఆయుర్వేద వైద్యుడు అతని నాన్న . పిల్లలు పుట్టకపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నారు.       " పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పిడ్యతే "అనగా  గతజన్మ పాపములు రోగాములై పుట్టి పిడించును. కావున ఈ జన్మలోనైనా సత్కర్మ లు  ఆచారించే సజ్జనులకు మాత్రమే ,స్వలాభాపేక్ష  లేకుండా చికిత్స చేయడం సద్వైద్యుని లక్షణం . అని నమ్మడమే కాకుండా నిజాజివితం లో తుచాతప్పకుండా పాటించిన ఉన్నత వ్యక్తి ఆయన.
  2. అప్పటి  కాలంలోనే చదువుకోకున్నా తెలివిలో , జీవిత రధాన్ని నడిపించగల నేర్పరి. (ఇలా ఎందుకు అన్నానో కథలో  ముందు ముందు తెలుస్తుంది.) అతని  తల్లి . కన్నా తల్లి ప్రేమకి నిలువు నిదర్శనం, కడుపుకోతకి  కన్నీటి సాక్షం . ఇది తెలుసుకోవాలంటే ఓ చిన్న కథ, కాదు కాదు యదార్థ గాధ చదవండి.
ఓ  కూతురు పుట్టడంతోనే చనిపోవడంతో,  అ కడుపుకోత తట్టుకోలేక.  పూడ్చి పెట్టిన ఆ పాపని చూడడానికి  కరెంట్ కూడా లేని  ఆ రోజులలోనే . రోజు రాత్రి   ఒక్కతే వెళ్లి బొందని తవ్వి చూసి వచ్చేది .ఇలావస్తుపోతున్న ఆమె ని చుసిన చుట్టుపక్క వాళ్ళు ఈ  పద్ధతి మంచిదికాదు అలా వెళ్ళకూడదు అని వారించడంతో మానుకుంది.


        4 . నలుగురు అన్నయ్యలు ,ఇద్దరు అక్కలు .                                                                                             పెద్దన్నయకు  & పెద్దక్కాయకు  వివాహం జరిగిపోయింది.


సామాజిక పరిస్థితులు:
             అయ్యగార్లు అవ్వడం వాళ్ళ  ఉరిలో , మంచి పేరు , పలుకుబడి  ఉన్న కుటుంబం.

part-5 Hero birth

అది 1963  దీపావళి ముందు రోజు , ఏడ్చుకుంటూ తల్లి గర్భంలోంచి పుట్టాడు .
ఓ పసిబాబు " అతడే మన కథానాయకుడు ".

ముగ్గురు ఉత్తమ ఋషిలా  పేరు పెట్టారు.

guess  .. the ... name   ...............
" విశ్వశోధ   "
పేరుకు అర్థం తెలియాలంటే , ఒక్కసారి పురాణం గురించి  మీ అమ్మని గాని (oh! sorry మన అమ్మలకు తెలిసే chance లేదు కదూ..)   ,అమ్మమ్మని గాని , బామ్మని గాని అడగండి.

About Me

My photo
Dr. Sucharitha Ph.D. Theatre arts Actress Director Dancer Violinist

your Opinion on this story